మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: ఆసియా ఖండంలోనే ప్రాముఖ్యతను సంతరించుకొన్న మెదక్ చర్చి ఫొటోను పోస్టల్ కవర్పై ముద్రించారు. శుక్రవారం మెదక్ హెడ్పోస్టాఫీస్ ఆవరణలో నిర్వహించిన వర్చువల్ ఫిలాటెలీ ఎగ్జిబిషన్లో భాగంగా మెదక్ చర్చి ఫొటోను పోస్టల్ కవర్తోపాటు చర్చి లోగోతో రూపొందించిన స్టాంప్ను తెలంగాణ పోస్ట్మాస్టర్ జనరల్ శ్రీలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వాటిని గుర్తించి పోస్టల్ కవర్లు, లోగోలు అందుబాటులోకి తెచ్చేందుకు తపాలా శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.