వరంగల్ : రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో 1868 ఎంఎం వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వరంగల్-ఖమ్మం రహదారిపై పంథిని సమీపంలో ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొసాగుతుండటంతో భారీ వాహనాలు మినహా రాకపోకలు బంద్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో..వరంగల్లోని లోతట్టు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ భాషా తదితరులు మంగళవారం రిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.