హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పారదర్శక విధానాలతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమ ల రంగంలో దూసుకెళ్తున్నదని, దేశంలోనే నేడు తెలంగాణ నెం.1 స్థానంలో ఉందని చెప్పారు. గురువారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్గా మఠం భిక్షపతి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మహ్మద్ తన్వీర్ బాధ్యతలు స్వీకరించారు.
కొత్త చైర్మన్లకు కవిత, మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఉత్పత్తులను ఎగుమతి చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పని చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భిక్షపతికి సూచించారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని చెప్పారు.