న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్లో తమ అవసరాల కోసం సైనిక శిబిరాలను నిర్మించాలని చైనా ప్రయత్నిస్తున్నది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను డ్రాగన్ దేశం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైనాకు చెందిన వందలాది మంది పాక్లో పనిచేస్తున్నారు. వీరి భద్రతపై చైనా తరుచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇటీవల కరాచీ యూనివర్సిటీ పరిసరాల్లో చైనా పౌరులే లక్ష్యంగా ఓ మహిళ తననుతాను పేల్చుకోవడంతో ముగ్గురు చైనా వాసులు మరణించారు. దీంతో డ్రాగన్ దేశం ఎట్టి పరిస్థితిల్లోనూ పాక్లో సైనిక శిబిరాలను నిర్మించాల్సిందేనని పట్టుబడుతున్నది. పాక్పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. అవసరమైతే పాక్కు ఇచ్చిన అప్పులను కొంతమేర వదులుకోవడానికి సిద్ధమేనన్నట్టు వ్యవహరిస్తున్నది.