హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఆరుగురు డీఐజీలను, ఏడుగురు జిల్లా రిజిస్ట్రార్లను, 73 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం చేసింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియను చేపట్టినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపింది. బుధవారం రెవెన్యూ శాఖ ము ఖ్య కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ నవీన్ మిట్టల్ను ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు.