హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ కుశ్వక్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్ ఐటీ విభాగం డీజీ(ఇన్వెస్టిగేషన్) వసుంధర సిన్హా ముంబైకి బదిలీ కాగా, ఆమె స్థానంలో సంజయ్ బహదూర్కు పోస్టింగ్ ఇచ్చారు. నగరంలోనే పనిచేస్తున్న శిశిర్ అగర్వాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్గా నియమితులయ్యారు.