ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన ఈశ్వర్చంద్ర రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు లాకర్లో ఉన్న కిలోన్నర బంగారు ఆభరణాలను శుక్రవారం మధ్యాహ్నం తీసుకొని మహాలక్ష్మి మందిరం వద్ద కారు ఆపి గుడిలోపలికి వెళ్లారు.
బయటికి వచ్చేసరికి కారులో బంగారు ఆభరణాల బ్యాగు కనిపించలేదు. పోలీసు స్ట్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన విషయం తెలియగానే సీపీ ఆదేశాల మేరకు అదనపు సీపీ జయరాం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆర్మూర్ ఏసీపీ, సీఐతోపాటు జిల్లాలోని టాస్క్ఫోర్స్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేలిముద్రల నిపుణులు కారును పరిశీలించి ఆధారాలను సేకరించారు.