నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాడుగులపల్లి మండలంలోని నారాయణపురం, మాచినపల్లి గ్రామాలకు చెందిన నలుగురు వార్డు మెంబర్లతో సహా 150 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని చెప్పారు. సీఎం సహకారంతో నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో మాచనపల్లి, నారాయణపురం గ్రామాల కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు కొండేటి శ్రీనివాస్, గన్నేపాక మహేశ్, అల్లంపెల్లి సైదులు, మామిడి జానయ్య అల్లంపల్లి శేఖర్, అల్లంపల్లి వెంకన్న, దారమళ్ల వెంకన్న, ఎడవెల్లి లక్ష్మణ్, మర్రి పెద్ద లింగయ్య, ఆవుల కోటేశ్, తవిటి నాగరాజు, రమేశ్, భాస్కర్, మహేందర్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, మాడుగులపల్లి మండల నాయకుడు పగిళ్ల సైదులు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పిచ్చిరెడ్డి, ధర్మాపురం సర్పంచ్ యాదగిరి రెడ్డి, కన్నేకల్ సర్పంచ్ కాటేపల్లి వెంకన్న గౌడ్, నారాయణపురం సర్పంచ్ ఆవుల అనిత, మాజీ సర్పంచ్ డాకయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కాటేపల్లి వెంకన్న నాయకులు మాధుగుల జాన్ కుమార్, తవిటి సైదులు, తవిటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.