ఆదిలాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ మండలంలోని రామాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పనులే తమను టీఆర్ఎస్లో చేరేలా చేశాయని వారు పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఆదిలాబాద్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన