నాగారం/అర్వపల్లి/మద్దిరాల, సెప్టెంబర్ 11: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలం డీ కొత్తపల్లి, అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం, కోమటిపల్లి, సూర్యానాయక్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. మద్దిరాల మండలంలో 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఐఎఫ్టీయూ నుంచి బీఆర్ఎస్కేవీలో చేరారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో అనంతగిరి మండలంలోని చనుపల్లి గ్రామానికి చెందిన వంద కుటుంబాల వారు గులాబీ కండువాలు కప్పుకొన్నారు.