జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు వీరమళ్ల వెంకటేశ్వర్లు, ఎఫ్ఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ రావుల భీమన్న, మాజీ వార్డు సభ్యుడు బొబ్బల గోపాల్, విశ్వ బ్రాహ్మణ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దోజు రమేష్, ముదిరాజు సంఘం ఉపాధ్యక్షుడు గంట శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు వీరమళ్ల రామాంజనేయులు, కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు వాసూరి వీరయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసూరి సోమయ్య, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ముత్యం సైదులు తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉల్లెంగల వెంకన్న, ఆ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర యాదగిరి, జలగం కొమురుమల్లు, ఉల్లెంగల ఎల్లయ్య, గాడిపెల్లి యాకయ్య BRS పార్టీలో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli)గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తొర్రూరు 11, 12 వార్డుల కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు బీఆర్ఎస్లో చేరారు.
పెద్దవంగర మండలం, చిట్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈదురు యాకయ్య,గజ్జి అశోక్, గజ్జి సందీప్,ఆవుల నారాయణ పిట్ట కొమురయ్య, ఆవుల విజయ్, రాయపర్తి మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రామ్మోహన చారి, సంతోష్, ఐలయ్య, అశోక్, రంజిత్, తొర్రూరు మున్సిపాలిటీ, 8 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మోటం భవాని, శ్యామ్ ల అధ్వర్యంలో చేరారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, కో ఆప్షన్ ఆశ్రఫ్ పాషా, యూత్ ప్రధాన కార్యదర్శి సంకినేని ఎల్లస్వామి పాల్గొన్నారు.