Telangana | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో డీహెచ్ రవీందర్నాయక్ అండదండలతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుగులోత్ రాజేశ్నాయక్ ఆరోపించారు. డీహెచ్తో కొందరు డీఎంహెచ్వోలు కుమ్మకై అవినీతికి బాటలు వేశారని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను బుధవారం ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్వోలు జిల్లాల్లో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా డీహెచ్ కాపాడుతున్నారని ఆరోపించారు.
డీఎంహెచ్వోల అవినీతిలో డీహెచ్ పాత్ర కూడా ఉన్నదని, ఇష్టారీతిలో డిప్యూటేషన్లు, వర్ ఆర్డర్లు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖలో వర్ఆర్డర్లు, డిప్యూటేషన్లు రద్దయిన నేపథ్యంలో ఇతర ఆఫీసర్లంతా తిరిగి సొంత స్థానాల్లో రిపోర్టు చేసినా, వర్ ఆర్డర్పై ఇన్చార్జి డీఎంహెచ్వోగా ఉన్న డాక్టర్ శిరీష మాత్రం సొంత పోస్టింగ్లోకి వెళ్లలేదని ఉదహరించారు. ఒరిజినల్ పోస్టు అధికారి తిరిగి కొత్తగూడెంకు వచ్చినా బాధ్యతలు అప్పగించకుండా డాక్టర్ శిరీష పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని వెంటనే శాఖాపరమైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.