మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 25 వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ షేక్ ఫరీదా ఖలీల్ తో సహా తన 300 మంది అనుచరుల సోమవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండుకవాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, మర్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్, గోగుల రాజు, మర్నేని రఘు, యాళ్ల మురళీధర్ రెడ్డి, ముస్తఫా, సాదిక్, మంగళంపల్లి రాజ్ కుమార్, బోగ రవిచంద్ర, శంశోద్దీన్, పార్టీ కార్యకర్తలు, వార్డ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.