జనగామ, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా జనగామ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు సహా మరో 500 మంది కార్యకర్తలు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి జనగామ ముత్తిరెడ్డి గులాబీకండువాలు కప్పి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ..సబ్బండ వర్గాలు, సకల కులాలు, మతాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నరీతిలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి దిక్సూచీగా నిలుస్తున్నాయన్నారు.
అందుకే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సైతం గులాబీ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్గా ఉన్న మారబోయిన పాండు తన వార్డు అభివృద్ధి కోసం పాడుతున్నాడని, ప్రభుత్వ పథకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ను వీడి గులాబీకండువా కప్పుకొని నేను సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతానని ముందుకు రావడం అభినందనీయమన్నారు.
పాండు నడిచిన బాటలోనే మరికొందరు టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని, పట్టణ అభివృద్ధిలో కలిసిపని చేసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. 15వ వార్డు కోసం ఇప్పటికే నిధులు కేటాయించామని, ఇంకా మిగిలిన ఉన్న పనులకు మరో రూ.2కోట్ల నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.