గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉష దంపతులు 150 మంది గర్భిణులకు చీరసారె పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే డెలివరీ చేయించుకోవాలని, సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక తదితరులు
పాల్గొన్నారు.
– తొర్రూరు