హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, సాగు పథకాలపై స్వామినాథన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
గత జూలైలో చెన్నైలో స్వామినాథన్ను కలిసినట్టు వివరించారు.ఈ సందర్భంగానే ఆయన రైతుబంధు పథకం అమలుపై ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. ‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం.. రైతులకు చీకట్లో వెలుగు దివ్వె వంటిది’ అంటూ ప్రశంసించారని పేర్కొన్నారు.