వరంగల్ : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట(Wardhannapet) మండలం ఇల్లంద గ్రామంలో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె శృతి మంగళవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. తమ బిడ్డ మృతికి అత్తింటి వరకట్న వేధింపులే కారణమని శృతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.