హైదరాబాద్ : వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. అగ్నిసాక్షిగా జీవితాంతాం తోడుంటానని మనువాడిన వాడే ఆమె పాలిట యముడిగా మారాడు. అదనపు కట్నం( Dowry harassment) కోసం తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు పాల్పడ్డాడు. ఇన్నాళ్లు అత్తారింటి వేధింపులను పంటి బిగువున భరించిన ఆ సోదరి ఇక చావే శరణ్యమనుకొని బలవన్మరణానికి పాల్పడింది.
వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం(Gajula ramaram)లో చోటు చేసుకుంది. అరుధంతి(28) అనే వివాహిత(Married woman) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కట్నం కోసం భర్త, అత్తమామలే వేధించారని, తన మరణానికి వారే కారణమని సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. అరుధంతి మృతితో గాజుల రామారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.