హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ఈ పథకాల కింద లబ్ధి పొందేందుకు చాలా మంది వివాహాన్ని నమోదు చేయించుకొనేందుకు ముందుకు వస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం గమనార్హం. గత ఐదేండ్లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగిన వివాహ రిజిస్ట్రేషన్లు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా జరిగాయి. ఐదేండ్లలో కరీంనగర్లో 76,062, వరంగల్లో 52,751 వివాహాలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి. అటు.. కులాంతర వివాహాలు (స్పెషల్ మ్యారేజెస్) సైతం వేల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నాయి.
పెండ్లి రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు