గంగాధర, ఫిబ్రవరి 16: బతుకమ్మ చీరల తయారీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు దాడులను నిలిపివేసి, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో పవర్లూమ్స్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గ్రామ కూడలిలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ అధికారులు మరమగ్గాలను సీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులపై కేసులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు వెంటనే దాడులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కేసులను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.