Dev ji | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత సెక్రటరీగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇక మల్లా రాజిరెడ్డి కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.