భీమ్గల్/ఏర్గట్ల, సెప్టెంబర్ 8 : వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డినే గెలిపించుకుంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేయడానికి కృషి చేస్తున్న మంత్రి వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన పలు కులసంఘాల వారు తీర్మానాలు చేసి ఎంపీపీ ఆర్మూర్ మహేశ్కు అందజేశారు.
గ్రామానికి చెందిన మున్నూరుకాపు పెద్ద సంఘానికి చెందిన 55 మంది సభ్యులు, ముదిరాజ్ సంఘం సభ్యులు 45 మంది, కుర్మగొల్ల, యాదవ సంఘం సభ్యులు నాలుగు పంతలు 120 మంది సభ్యులు, రజక సంఘం సభ్యులు 27మంది, ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన మాదిగ సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు తీర్మానం చేశారు.