హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడిచే రైళ్లను రద్దు చేసినట్టు గురువారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. గుంటూరు-డోన్, గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-మెదక్, గుంటూరు-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో రైళ్లను రద్దు చేశారు.
ఆగస్టు 3 వరకు తేదీల వారీగా పలు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. హసన్పర్తి- కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్పై భారీగా వర్షపు నీరు నిలవడంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్ల మధ్య మూడు రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.