హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): టెంపుల్ సిటీ యాద్రాద్రిలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుడు శ్రీనివాస్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో యాదాద్రిభువనగిరి జిల్లా కు చెందిన కాంగ్రెస్ నాయకులు, స్థానిక సంస్థ ల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, గౌలికార్ అరుణ, ముఖ్యర్ల మల్లేశ్, బిట్టు సరోజ, ఎంపీటీసీలు సామల పద్మావతి, మౌనిక, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.