పెద్దపల్లి : తెలంగాణలో గ్రామీణ పరిస్థితులు పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టులు నిర్మించి పంటలకు నీరందిస్తున్నారని. ఉచితంగా కరెంట్ను అందిస్తున్నారని, పండిన పంటలను కొనుగోలు చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విరివిగా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక్క తెలంగాణలో మాత్రమే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు.
పేదింటి పెళ్లికి ప్రభుత్వం కానుక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, గర్భిణులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు.