హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నేతలు బెయిల్పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో బీజేపీ ఏర్పాటుచేసిన ప్రజాగ్రహ సభలో ఆయన ప్రసంగించారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని జోస్యం చెప్పారు.