యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – వరంగల్ 163 వ జాతీయ రహదారి పై పెద్దకందుకూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ’(RTC bus) బస్సు, లారీ(Lorry )ఢీ కొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న వరంగల్-1 డిపోకు చెందిన బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను ఆలేరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.