బెంగళూరు: కర్ణాటకలో యువతలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ శిబిరాలను తప్పనిసరి చేసింది. అయితే ఎవరి అనుమతి లేకుండా ఎలాంటి పరీక్షలు లేదా స్క్రీనింగ్ నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక హెచ్ఐవీ బాధితులున్న రాష్ర్టాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయసు కలిగిన ఏడు వేలకు పైగా విద్యార్థులు హెచ్ఐవీ బారిన పడ్డారు.