హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పలు రైతు సంఘాలు ఆరోపించాయి. గురువారం ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.2,22,281 కోట్ల నిధులు కేటాయించినట్టు ప్రకటించినా.. వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని సంఘం ప్రతినిధులు ఆరోపించారు.
కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది.