జగిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లికార్జున స్వామి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి నిలువెత్తు బంగారం (బెల్లం) చెల్లించారు. అనంతరం రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి దేవాలయం రాజ గోపురాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మల్లన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.