Manne Krishank | హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు 7వ సెషన్ జడ్జి రేపు విచారించనున్నారు. 4వ సెషన్ కోర్టు జడ్జి అందుబాటులో లేకపోవడంతో కేసును 6వ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో ఈ కేసును 3వ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేశారు. 3వ సెషన్ కోర్టు జడ్జి సెలవుపై వెళ్తుండటంతో ఈ కేసును 7వ సెషన్ కోర్టుకు బదిలీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో మన్నె క్రిశాంక్ ఒక్కరోజు కస్టడీ ముగియడంతో సోమవారం నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ను కొనసాగిస్తూ ఇన్చార్జి కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడి తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్కు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో సాక్షాధారాలు, సాక్షులను తారుమారు చేసే అవకాశమున్నదని, బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు.