మహబూబ్ నగర్ : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో జీవన్ రెడ్డి చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ..టీటీడీ ధర్మ కర్తల పాలక మండలిలో చోటు కల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామీ సన్నిధిలో ఒక భక్తునిగా నాకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషింగా ఉందన్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తానని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
మత్స్యరంగానికి ఊపిరి పోసిన సీఎం కేసీఆర్ : మంత్రి తలసాని