మెదక్: మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి (Manjeera River) భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం (Edupayala Vanadurga Temple) జలదిగ్బంధంలో చిక్కుకున్నది. అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజ గోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో గత 14 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. దీంతో భక్తుల రాకపై నిషేధం విధించారు.