హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రభుత్వం మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు బుధవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు ఉత్తర్వులు జారీచేశారు. రామాపురం ప్రాంతంలో మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధికంగా మామిడి పండే ప్రాంతాల్లో కొల్లాపూర్ ఒకటి. ఇక్కడ పండే మామిడిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. రైతులు పంటను విక్రయించడానికి హై దరాబాద్కు తీసుకురావాల్సి వస్తున్నది. కొన్నేండ్లుగా ఇక్కడ మామిడి విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్ను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మార్కెట్ను ఏర్పాటు చేశారు.