సూర్యాపేట : కాంగ్రెస్ నాయకులు(Congress leaders) మాదిగ పల్లెలకు (Madiga colonies) వస్తే తరిమికొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
మాదిగ పల్లెలకు ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్కు మంచి చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాల లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనేది అక్షర సత్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మూడు పార్లమెంట్ టికెట్లు ఇవ్వకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చెప్పుకోవడానికే మాదిగలలో దామోద రాజనర్సింహానికి పదవి ఇచ్చారు.
బాబు జగ్జీవన్ రామ్ భవన ఆవిష్క రణ ఆహ్వాన పత్రికలో దామోదర రాజనర్సింహ పేరు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్కు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాలలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సంఘటనలతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు మాదిగ పల్లెలకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారో చూస్తామన్నారు.