హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూలో బయోమెట్రిక్ ఆధారిత ఆన్స్క్రీన్ మూల్యాంకనాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధానంలో భాగంగా ఫ్యాకల్టీ కాలేజీల్లో లేదా, ఇంట్లోనే ఉండి విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఇందుకోసం అర్హులైన ఫ్యాకల్టీలు జేఎన్టీయూ పరీక్షల విభాగాన్ని సంప్రదించి వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ అధికారులు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాలని, ఇందుకోసం ఫ్యాకల్టీయే మంత్ర ఎంఎఫ్ఎస్ 100 బయోమెట్రిక్ పరికరాన్ని కొనుగోలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.