మహబూబాబాద్: మహబూబాబాద్లోని నందినగర్లో వ్యక్తి దారుణ హత్యకు (Murder) గురయ్యాడు. నందినగర్లోని చెరువుకట్టపై దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపేశారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడిని బాణోత్ లక్పతిగా గుర్తించారు. అతడు నెల్లికుదురు మండలంలోని సున్నపురాళ్ల తండా వాసి అని చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.