నల్లగొండ: జిల్లాలోని డిండి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని పడమటితండాలో ఓ వ్యక్తిని ఓ మహిళ హత్య (Murder ) చేసింది. గ్రామానికి చెందిన చీన్యను ఓ మహిళ గొడ్డలితో నరికి చంపింది. అనంతరం అక్కడి నుంచి పరారయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పరారీలో ఉన్నదని వెల్లడించారు. కాగా, హత్యకు అక్రమసంబంధమే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
మరో ఘటనలో జగిత్యాలలో ఇటుకబట్టీ కార్మికుల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరు చనిపోయారు. జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్లలో బావమరిది తరుణ్పై బావ రుతన్ చాత్రియ కర్రతో దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తరుణ్ దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
తన అక్కపై బావ రుతన్ దాడిచేస్తుండగా తరుణ్ అడ్డుకోబోయాడని, ఈ క్రమంలో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఒడిశాకు చెందినవారని వెల్లడించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.