చెన్నారావుపేట, జనవరి 3: పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్టు విషయంలో గొడవలు ఉన్నాయి. సోమవారం కూడా గెట్టుపై వారికి లొల్లి జరిగింది.
మార్కండేయ తన చేతిలో ఉన్న పారతో రాజు (40)పై దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయిన రాజును పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయాడు. రాజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబీకులు, గ్రామస్థులు, పోలీసులు వెతకగా బావిలో రాజు మృతదేహం దొరికింది. మృతుడికి భార్య సుజాత, ఇద్దరుకుమార్తెలు.