రంగారెడ్డి : మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బుద్వేల్ రైల్వేస్టేషన్కు సమీపంలోని బస్తీలో ఇద్దరు భార్యాభర్తలు గత కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజుల నుంచి తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
గురువారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భార్యను బండరాయితో కొట్టి చంపాడు భర్త. అనంతరం భర్త అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. మృతురాలిని మీరాగా, భర్తను జంగయ్య యాదవ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.