బొంరాస్పేట: వికారాబాద్ జిల్లాలోని బోంరాస్పేటలో విషాదం చోటుచేసుకుంది. బోంరాస్పేట మండలంలోని కొత్తూరులో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి నీటమునిగి చనిపోయాడు. గ్రామానికి చెందిన సంగెం చిన్న పెంటయ్య శనివారం తెల్లవారుజామున చేపలు పట్టడానికి చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. గుర్తించిన గ్రామస్థులు మృతదేహాన్ని నీటిలోనుంచి వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.