సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి చనిపోయాడు. మండలంలోని సరళమైసమ్మ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో వంశీ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. తోటివారు గుర్తించేలోపే అతడు శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతు హైదరాబాద్లోని కర్మన్ఘాట్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.