జమ్మికుంట (హుజూరాబాద్ టౌన్), ఆగస్టు 15: ట్రాన్స్ఫార్మర్పై చనిపోయిన ఓ కోతిని తీస్తుండగా.. విద్యుత్తు షాక్ తగలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జరిగింది. మడిపల్లి గ్రామంలో ఓ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్పై కోతి చనిపోయింది. దానిని గ్రామానికి చెందిన ముకుంద సతీశ్ (53) తీసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి పై నుంచి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని జమ్మికుంట దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి నేత్రాలను సదాశివ ఫౌండేషన్కు దానం చేశారు. మృతుడి కొడుకు ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బర్పాటి రమేశ్ తెలిపారు.