కరీంనగర్ రాంనగర్, జూలై 5 : ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య వేధించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కరీంనగర్ రూరల్ సీఐ నీరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన కల్యాణం రాకేశ్ (27) రెండేండ్ల క్రితం హైదరాబాద్కు చెందిన సంజన అలియాస్ వర్షను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరు కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగట్టపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇంకా పిల్లలు లేరు. కొంతకాలంగా రాకేశ్ను తన తల్లిండ్రులను కలువకుండా, వారితో ఫోన్లో మాట్లాడనివ్వకుండా సంజన వేధింపులకు గురిచేస్తున్నది. దీంతో రాకేశ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేశ్ తండ్రి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.