హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మల్లు రవి దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి తరఫున మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్కు దరఖాస్తు సమర్పించారు. తనను ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించినప్పటికీ ఎంపీగా పోటీచేస్తానని మల్లు రవి గతంలోనే ప్రకటించారు. ఎంపీగా పోటీచేయడానికి ఆ పదవి అడ్డు వస్తే, దానిని వదులుకుంటానని వెల్లడించారు. మల్కాజిగిరి నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ దరఖాస్తు చేశారు.