చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఎన్నికల ఖర్చు కోసం చెన్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్రెడ్డి రూ.51 వేలు విరాళంగా అందజేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని సమక్షంలో విప్ బాల్క సుమన్కు ఈ మొత్తాన్ని అందజేశారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేయడంతో అందులో నుంచి రూ. 51 వేలు అందించినట్టు దామోదర్రెడ్డి తెలిపారు.
– చెన్నూర్