Mallareddy | హైదరాబాద్ : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఓ చిన్న రిక్వెస్ట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి ఈ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే.. నాదేం లేదు.. ఒక్కటే నిమిషం.. ఒక్కటే సెకండ్. ఒక రిక్వెస్ట్ చేస్తున్నా.. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది కాబట్టి.. 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అని మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ముగించేశారు. దీంతో సభాపతితో పాటు సభ్యులు నవ్వారు.