చేర్యాల, మార్చి 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) 9వ వారం సందర్భంగా భక్తులతో(Devotees) కిటకిటలాడింది. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారిని 35 వేల మంది భక్తులు దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న ఆలయ ఈవో ఏ.బాలాజీ, కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది సేవలు అందించారు. కాగా హైదరాబాద్ నగరంలోని బోయినిపల్లికి చెందిన భీమనబోయిన ఉమరాజ్యాదవ్ 842 గ్రాముల బంగారు రుద్రాక్షమాలను శ్రీ మల్లికార్జున స్వామి వారికి సమర్పించారు.