టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదలకు నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సూచనలతో మల్లన్నసాగర్ జలాశయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా పేర్కొన్నారు. కొమురవెల్లి దేవాలయం, యాదాద్రి దేవస్థానం, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లన్నింటినీ అద్భుత టూరిజం హబ్లుగా మారుస్తామని వెల్లడించారు. నిధుల విడుదలకు నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.