చేర్యాల, ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. 90 రోజులకు సంబంధించి 14 హుండీలను లెక్కించగా రూ.1,05,54,786 నగదుతోపాటు 120 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కిలోల 300 గ్రాముల మిశ్రమ వెండి సమకూరింది. 41 విదేశీ కరెన్సీ నోట్లు, 2,300 కిలోల మొక్కుబడి బియ్యం వచ్చాయి. నగదును స్థానిక ఏపీజీవీబీలో జమ చేశారు.